కృష్ణపట్నం పోర్టుతో పెరుగుతున్న సర్కారు ఆదాయం

గత ఏడాది 106 కోట్ల వసూలు లక్ష్యం కాగా 107 కోట్ల రూపాయలు వసూలయిందన్నారు. ఇదిలావుండగా కృష్ణపట్నం పోర్టు నుండి సర్వీసు టాక్స్ రూపంలో 50 కోట్ల రూపాయలు వసూలయిందన్నారు. అలాగే పోర్డు నుండి ఐరన్ ఓర్ రవాణాకు సంబంధించి ఎగుమతి సుంకం రూపంలో 270 కోట్ల రూపాయలు వసూలయిందన్నారు. అలాగే చక్కెర, ఎరువులు, యంత్రాలు, బొగ్గు రవాణాకు సంబంధించి దిగుమతి సుంకం రూపంలో 230 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమయిందన్నారు.

http://www.andhrabhoomi.net/sri-pottisriramulu/income-389